

వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న ‘అహోం’ సినిమా ఈరోజు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రాన్ని ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్పై దశరథ్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. ఈ కార్యక్రమానికి నిర్మాత కేఎస్ రామారావు, దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ, ప్రసాద్ రాజు అనుభవం ఉన్న దర్శకుడని తెలిపారు. ఒకే భాషలో సినిమాలు చేయడం ఈ రోజుల్లో సరిపోదని, బహుభాషల్లో సినిమా చేయడం మంచి పరిణామమని అన్నారు. అలాగే ఈ సినిమాను మరిన్ని భాషల్లో కూడా డబ్ చేయాలని సూచించారు. కొత్త నిర్మాతలను ప్రోత్సహిస్తే పరిశ్రమలో మరిన్ని సినిమాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. హీరోయిన శృతిక, హీరో వివేక్ మిశ్రా ఈ సినిమా కోసం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. శృతిక తనకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు.
.jpeg)
హీరో వివేక్ మిశ్రా హైదరాబాద్ సినిమాలు, సంగీతానికి ప్రసిద్ధి చెందిన నగరమని, ఇక్కడ నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. మోడల్ దీప్తి, నటుడు ఆజాద్, నటుడు విశ్వ, కోటకొండ కృష్ణ, వినయ్, శాండీ వంటి పలువురు తమ శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు ప్రసాద్ రాజు మాట్లాడుతూ, మంచి సినిమా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించానని, సినిమా విజయవంతం కావడం ప్రేక్షకులపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. నిర్మాత దశరథ్ మాట్లాడుతూ, ఈ సినిమా మంచి కమర్షియల్ అంశాలతో కొత్త కథతో రూపొందుతుందని, ప్రేక్షకుల సహకారం కోరారు.















.jpeg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!