
క్రీడలు

అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు రాష్ట్ర గీతాల ఆలాపనకు సంబంధించి కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారిక రాష్ట్ర గీతాన్ని ఆలపించే సంప్రదాయం ఉంటే, నిర్దేశించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
కార్యక్రమం ప్రారంభంలో లేదా ప్రోటోకాల్ ప్రకారం ముందుగా వందేమాతరం, ఆ తర్వాత జనగణమనను పూర్తిగా ఆలపించాలని కేంద్రం పేర్కొంది. ఈ రెండు పూర్తైన తర్వాత మాత్రమే సంబంధిత రాష్ట్ర అధికారిక గీతాన్ని పాడాల్సి ఉంటుందని హోంశాఖ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!