

మనుషుల శరీరం కదలడానికి రూపొందించబడింది. అయితే ఆధునిక జీవనశైలిలో గంటల తరబడి కూర్చోవడం వల్ల ‘సిట్టింగ్ డిసీజ్’ అనే సమస్య పెరుగుతోంది. కేవలం వ్యాయామం చేయడం సరిపోదని, రోజంతా కదలికలు లేకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జీవక్రియ మందగించి, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి డయాబెటిస్, గుండె వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
అలాగే వెన్ను, మెడపై ఒత్తిడి పెరిగి నొప్పులు, శరీర భంగిమలో మార్పులు వస్తాయి. రక్త ప్రసరణ తగ్గి అలసట, ఏకాగ్రత లోపం, మానసిక సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యల నివారణకు ‘20-8-2’ రూల్ను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు కూర్చోవడం, 8 నిమిషాలు నిలబడడం, 2 నిమిషాలు నడవడం ద్వారా శరీరాన్ని చురుకుగా ఉంచుకోవచ్చు. రోజంతా చలనం ఉండటం ఆరోగ్యానికి అత్యంత కీలకం.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!