

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడిగా ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో హీరోగా పరిచయం కానున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో చందమామకథలు పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యువ నటి రాషా తడానీ హీరోయిన్గా టాలీవుడ్కు పరిచయం కానుంది. ఈ చిత్రం తొలుత జులై 9న విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం జులై 10న విడుదలకు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ పోటీని నివారించేందుకు ‘శ్రీనివాస మంగాపురం’ విడుదల తేదీని మార్చాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!