
గాసిప్స్

అడవిపల్లెపాలెం గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ డీజిల్ కొనుగోలు పేరుతో పంచాయతీ ఖాతా నుంచి రూ.15 లక్షలు డ్రా చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. ఇదే విధంగా ఇతర పంచాయతీల్లో కూడా సుమారు రూ.30 లక్షల వరకు నిధులు డ్రా చేసినట్లు సమాచారం. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా విషయం బయటపడటంతో పంచాయతీరాజ్ కమిషనర్ వెంటనే విచారణకు ఆదేశించారు.
ఈ ఆరోపణలపై పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి వివరణ ఇచ్చారు. నెలలుగా సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోవడంతో డీజిల్ హెడ్ ఖాతా నుంచి నిధులు తీసుకుని వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ఇలా చేయాల్సి వచ్చిందని వారు చెప్పారు. అయితే నిబంధనల ఉల్లంఘన జరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డీపీవో రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!