
బిజినెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2029 ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రజలు తన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తిస్తారా అనే అనుమానం ఉందని, తదుపరి ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామనే హామీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. 2024లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన నేతగా ఆయన మరింత ఆత్మవిశ్వాసం చూపించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. నాయకులు భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేయకుండా ప్రజల్లో నమ్మకం పెంచాలని సూచిస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాలతోనే విజయం సాధ్యం కాదని, 2024లో జగన్ ఓటమి కూడా అదే నిరూపించిందని విశ్లేషకులు అంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!