

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’పై రోజురోజుకీ ఆసక్తికరమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు 40 శాతం పూర్తైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్ర కోసం కత్రినా కైఫ్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కథలో ప్రాధాన్యం ఉన్న ఈ పాత్రపై ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకవేళ ఈ ప్రతిపాదన ఖరారైతే, దాదాపు 11 ఏళ్ల తర్వాత కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించినట్లవుతుంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
ఈ చిత్రంలో కత్రినా కైఫ్ పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పవర్ఫుల్ పోలీస్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఫ్లాష్బ్యాక్ భాగాల్లో ఆయన పూర్తిగా వైల్డ్ అండ్ మాస్ లుక్లో కనిపించనున్నట్లు సమాచారం. హీరోయిన్గా త్రుప్తి దిమ్రి నటిస్తుండగా, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. కథ, పాత్రల రూపకల్పనతో పాటు భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!