

బాలీవుడ్ స్టార్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మించనున్న భారీ మైథాలాజికల్ జంగిల్ అడ్వెంచర్ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ధనుష్ సరసన బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ నటించనున్నారనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దట్టమైన అడవి నేపథ్యంలో ఏనుగు చుట్టూ సాగే విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. 2027 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
కరీనా కపూర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్కు అంగీకరిస్తే, సంజయ్ లీలా భన్సాలీతో ఆమెకు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కలయిక కానుంది. గతంలో ‘దేవదాస్’ చిత్రంతో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ప్రస్తుతం భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత ధనుష్ నటించే ఈ భారీ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ధనుష్-కరీనా కాంబినేషన్పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!