

‘బాహుబలి’తో పాన్ ఇండియా స్థాయిలో అగ్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో, ఎంతో జాగ్రత్తగా రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత, రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం వైపు అడుగులు వేయబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
మహాభారతం సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర అత్యంత కీలకంగా ఉండనుండటంతో, ఆ పాత్రను ఎవరు పోషిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. తాజా సమాచారం ప్రకారం, ఈ పాత్రను జూనియర్ ఎన్టీఆర్తో చేయించాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళికి ఎన్టీఆర్తో ఉన్న స్నేహం, అలాగే పాత్రలో కొత్తదనం తీసుకురావడంలో ఆయన ప్రతిభ ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
రాజమౌళి చెప్పినట్టుగా డేట్స్ కేటాయించడానికి ఎన్టీఆర్ సిద్ధంగా ఉంటాడనే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాకు త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మహాభారతంలో దేశవ్యాప్తంగా ప్రముఖ నటులు పాల్గొనబోతున్నారని, ఎవరు ఏ పాత్రలో నటిస్తారనే విషయంపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!