
సినిమాలు

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పృథ్వీరాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి పనితీరును ప్రశంసిస్తూ, సెట్స్లో ఒక్క నిమిషం కూడా వృథా చేయరని, మధ్యాహ్న భోజన విరామం కేవలం 20 నిమిషాలే ఉంటుందని తెలిపారు.
పరిపూర్ణతకు ప్రాధాన్యం ఇచ్చే రాజమౌళి కొన్ని సన్నివేశాల కోసం 90 టేకులు తీసుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబుపై చిత్రీకరించిన ఒక సన్నివేశం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఆ రోజు చిత్రీకరణను నిలిపివేశారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కథా విస్తృతి కారణంగా ‘వారణాసి’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!