
జనరల్

హైదరాబాద్ షేక్పేట పరిధిలోని హకీంషా విరాట్నగర్ వరద కాలువను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆకస్మికంగా పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో నాలా పరిస్థితిని పరిశీలించిన ఆయన, రెండు నుంచి మూడు రోజుల్లో జేసీబీల సహాయంతో పేరుకుపోయిన చెత్త, పూడికను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు.
నాలా పరిసరాల్లో మళ్లీ చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెత్త వేస్తున్న వారిని గుర్తించేందుకు నాలా వెంట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!