
టెక్నాలజీ

ఎస్ఐఆర్ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రెస్మీట్లో తెలిపారు. ఇది ప్రధాని మోదీ లేదా బీజేపీ తీసుకొచ్చిన కొత్త ప్రక్రియ కాదని, ఓటరు జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం చేపట్టే సాధారణ చర్య మాత్రమేనని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటివరకు 12 సార్లు ఈ ప్రక్రియ జరిగిందని ఆయన గుర్తుచేశారు.
ఓటరు జాబితా నుంచి మృతులు, మారిన వ్యక్తుల పేర్లు తొలగించడమే ఎస్ఐఆర్ ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే స్వరంతో విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు కూడా దీనిని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియగా స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అక్రమ ఓటర్ల నమోదు, బోగస్ ఓటింగ్పై కూడా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!