
జనరల్

H-1B వీసా దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. విస్కాన్సిన్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కార్మిక శాఖ ఇప్పటికే వీసా మోసాలకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించి అనుమానితులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
కొన్ని పెద్ద కంపెనీలు, మధ్యవర్తులు తక్కువ వేతనాలకు విదేశీయులను నియమించుకుంటూ హెచ్-1బీ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కేలా చూడడం, పన్ను చెల్లింపుదారుల సొమ్మును కాపాడడం, వీసా మోసాలను అరికట్టడం ట్రంప్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసాదారుల్లో భారతీయులే అత్యధికంగా ఉండగా, దాదాపు 7.3 లక్షల మంది ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 12.8 లక్షల మంది అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!