

భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ వ్యక్తిత్వ హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఊరట కల్పించింది. ఆయన పేరు, ఫొటో, గుర్తింపును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో ఉన్న అభ్యంతరకర లింకులను వెంటనే తొలగించాలని ఇంటర్మీడియరీలకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కోర్టు తెలిపింది. జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం నిందితులకు సమన్లు జారీ చేసి, తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
ఏఐ ద్వారా రూపొందించిన అసభ్యకర కంటెంట్తో పాటు అనుమతి లేకుండా తన గుర్తింపును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని అభిషేక్ శర్మ కోర్టును ఆశ్రయించారు. ఒక ఏఐ పోస్ట్లో తన మేనేజర్ను గర్ల్ఫ్రెండ్గా తప్పుడు ప్రచారం చేశారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికల్లో కూడా తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. మెటా తమ ప్లాట్ఫారమ్లలో ఉన్న రెండు అభ్యంతరకర లింకులను తొలగిస్తామని కోర్టుకు హామీ ఇవ్వగా, అమెజాన్ కూడా వాటిని తొలగించేందుకు అంగీకరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!