

పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఆ దేశ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని మళ్లీ అమలు చేసినట్లు ప్రకటించింది. ప్రాంతంలో 20కిపైగా యుద్ధనౌకలు, వందలాది యుద్ధ విమానాలను మోహరించినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో ఇరాన్లోని పలు కీలక లక్ష్యాలపై అమెరికా వరుసగా నాలుగో రోజు దాడులు కొనసాగించింది.
సిరిక్, బందర్ అబ్బాస్, చాబహార్, అహ్వజ్ ప్రాంతాలతో పాటు ఖేష్మ్ ద్వీపంలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అధికార మీడియా తెలిపింది. మరోవైపు కువైట్ నౌకాదళంపై ఇరాన్ దాడి చేయడంతో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. తమపై ప్రయోగించిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నామని కువైట్ వెల్లడించింది. ఇదిలా ఉండగా, యుద్ధం ముగింపుపై అమెరికాతో ఉన్న అవగాహన ఒప్పందం ఇక చెల్లదని ఇరాన్ విదేశాంగశాఖ సహాయ మంత్రి కాజెమ్ గరిబాబాది తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!