

యజమాని అంగీకారం లేకుండా లీజుదారు ఉపలీజు ఇవ్వడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. చర్లపల్లిలోని ఓ ఇంటిని యజమాని అనుమతి లేకుండా ఉపలీజుకు తీసుకుని పోలీస్ స్టేషన్గా ఉపయోగించడం అక్రమమని పేర్కొంది. ఇంటి యజమాని ఇచ్చిన వినతిపత్రంపై సరైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణలో హక్కులు పరిశీలించకుండా చేపట్టిన చర్యలను కోర్టు తప్పుపట్టింది.
పిటిషనర్ తిరుమల లక్ష్మణాచార్యులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ విచారణ జరిపారు. చర్లపల్లి ఈసీనగర్లోని భవనాన్ని ఒక సొసైటీకి అద్దెకు ఇచ్చినప్పటికీ, యజమాని అనుమతి లేకుండా పోలీస్ స్టేషన్కు ఉపలీజుకు ఇచ్చారని పిటిషనర్ వాదించారు. అద్దె, విద్యుత్ బకాయిల సమస్యలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఒప్పంద కాలం ముగిసిన తర్వాత కూడా భవనం ఖాళీ చేయకపోవడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంటూ, మూడు నెలల్లో సమస్యను పరిష్కరించాలని డీజీపీకి ఆదేశిస్తూ కేసును ముగించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!