
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎస్పీ వేలుమణి నేతృత్వంలో పార్టీ నాయకుడు పలనిస్వామి కలుసుకున్నారు. ఈ సమావేశంలో పార్టీలో చీలిక లేదని ప్రకటిస్తూ పళనిస్వామికి పూర్తి మద్దతు తెలిపారు.
సమావేశం అనంతరం తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ను కూడా కలుసుకుని తాము మళ్లీ ఐక్యంగా ఉన్నామని స్పష్టం చేశారు. గతంలో కొన్ని భిన్నాభిప్రాయాల కారణంగా విభేదాలు వచ్చినప్పటికీ అవన్నీ పరిష్కారమయ్యాయని తెలిపారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న అనర్హత ప్రక్రియపై కూడా ఇక సడలింపు వచ్చే అవకాశం ఉందని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!