

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై విషాదం చోటుచేసుకుంది. శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అనంతరం కిందకు దిగుతున్న సమయంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. మృతులను అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగా గుర్తించారు. పర్వతం దిగుతున్న సమయంలో తీవ్ర అలసటకు గురికావడంతో వారిని రక్షించేందుకు గైడ్స్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అధికారులు తెలిపారు.
నేపాల్ ఎక్స్పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, బుధవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 274 మంది పర్వతారోహకుల బృందంలో సందీప్ ఆరేతో పాటు తులసి రెడ్డి పాల్పునూరి, అజయ్ పాల్ సింగ్ అనే మరో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో ఎవరెస్ట్ను అధిరోహించిన బృందంగా వీరు రికార్డు సృష్టించారు. అయితే శిఖరం దిగుతున్న సమయంలో సందీప్ ఆరే మృతి చెందగా, గురువారం మరో బృందంతో దిగుతున్న అరుణ్ కుమార్ తివారీ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!