

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యమే నిర్వహించనుండగా, పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కండక్టర్ పోస్టుల భర్తీ జరగకపోవడంతో ఉద్యోగుల పదవీ విరమణ కారణంగా ఖాళీలు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అయితే అభ్యర్థుల ఎంపికలో మార్కుల విధానం, గ్రేడింగ్ విధానం మధ్య సమన్వయం కీలక అంశంగా మారింది. కొందరు అభ్యర్థులు మార్కుల ఆధారిత సర్టిఫికెట్లతో, మరికొందరు గ్రేడ్ పాయింట్లతో దరఖాస్తు చేయనున్న నేపథ్యంలో ఈ రెండింటిని సమానంగా ఎలా పరిగణించాలనే అంశంపై ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. దీనిపై స్పష్టత కోసం ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. బోర్డు నుంచి మార్గదర్శకాలు వచ్చిన అనంతరం అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!