
జనరల్

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో యూరియా సరఫరా, పామాయిల్కు కనీస హామీ ధరతో పాటు వ్యవసాయ రంగ సంస్థలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు సమస్యలను తుమ్మల కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ పామాయిల్ సాగు విస్తీర్ణంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండటంపై శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించిన పలు సమస్యలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!