

హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ) కాలనీలోని ఓపెన్ ప్లాట్లకు మరోసారి భారీ ధర పలికింది. కేపీహెచ్బీ 7వ ఫేజ్లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.2.70 లక్షలకు అమ్ముడైంది. మరో ప్లాట్ చదరపు గజం రూ.2.36 లక్షలకు, మరో రెండు ప్లాట్లు రూ.2.06 లక్షల చొప్పున విక్రయమయ్యాయి. ఈ ప్లాట్లకు కనీస ధరను చదరపు గజానికి రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు.
వేలం ప్రక్రియలో మొత్తం 19 మంది బిడ్డర్లు పాల్గొనగా, చదరపు గజానికి సగటు ధర సుమారు రూ.1.79 లక్షలు పలికింది. ఈ బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.47.14 కోట్ల ఆదాయం వచ్చినట్లు బోర్డు వైస్ ఛైర్మన్ వి.పీ. గౌతమ్ తెలిపారు. ఎలాంటి వివాదాలు లేని, అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్బీ ప్రాంతంలోని ప్లాట్లకు ఉన్న డిమాండ్కు ఈ రికార్డు ధరలు నిదర్శనమని అధికారులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!