

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద కార్యక్రమం లక్షలాది మంది భక్తులకు ఉచిత భోజన సేవలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. 1985 ఏప్రిల్ 6న కేవలం 2,000 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం వారాంతాలు, రద్దీ రోజుల్లో రోజుకు దాదాపు 3 లక్షల మంది భక్తులకు, సాధారణ రోజుల్లో 1.8 నుంచి 1.9 లక్షల మంది భక్తులకు భోజనం, అల్పాహారం, పానీయాలను అందిస్తోంది.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ప్రధాన కేంద్రంగా రోజుకు 82 వేల మందికి పైగా భక్తులకు సేవలందిస్తోంది. 2026 జనవరి నుంచి మే వరకు 4.4 కోట్లకు పైగా భోజన, అల్పాహార, పానీయాల సర్వింగ్స్ పంపిణీ చేసినట్లు టిటిడి గణాంకాలు వెల్లడించాయి. ఆధునిక వంటశాలలు, వేలాది మంది సిబ్బంది, శ్రీవారి సేవకుల సహకారంతో ఈ సేవలు కొనసాగుతున్నాయి. రూ.2,500 కోట్లకు పైగా నిధులతో ఉన్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ ఈ మహత్తర కార్యక్రమానికి బలంగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!