

కేంద్రం నియమించిన పరీక్షల సంస్కరణల టాస్క్ఫోర్స్ సభ్యుడు, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో ప్రశ్నపత్రాల రూపకర్తల విశ్వసనీయత, నిజాయతీ అత్యంత కీలక సవాల్ అని తెలిపారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత నాలుగు దశాబ్దాల్లో పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీంతో సాంకేతిక జోక్యం ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
పరీక్షల పర్యవేక్షణలో కెమెరా వ్యవస్థలు బలపడినప్పటికీ, ప్రశ్నపత్రాల తయారీ దశలో లోపాలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన అన్నారు. నీట్-2024లో ముద్రణ తర్వాత రవాణా సమయంలో లీక్ జరిగిందని, అయితే నీట్-2026లో ప్రశ్నపత్రం తయారీ దశలోనే లీక్ అయినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని వివరించారు. పూర్తి గోప్యతతో, నమ్మకంగా పనిచేసే అధ్యాపకులు అవసరమని, పారదర్శకంగా, లీకేజీకి అవకాశం లేకుండా వ్యవస్థను రూపొందించడం కమిటీ లక్ష్యమని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!