

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ట్రంప్ ఫోటోతో ప్రత్యేక యూఎస్ పాస్పోర్టులు విడుదల చేయాలని నిర్ణయించింది. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఈ పాస్పోర్టులను పరిమిత సంఖ్యలో తయారు చేయనున్నారు. ఈ విషయాన్ని యూఎస్ విదేశాంగ శాఖ అధికారికంగా తెలిపింది. జులైలో జరిగే ఈ వేడుకల సందర్భంగా ఇది ఒక ప్రత్యేక చర్యగా భావిస్తున్నారు.
ఈ పాస్పోర్టులు పరిమితంగా మాత్రమే విడుదల అవుతాయి, అలాగే అదనపు ఫీజు ఉండదని అధికారులు చెప్పారు. వైట్ హౌస్ కూడా దీనిని నిర్ధారించి కొన్ని నమూనా ఫోటోలను విడుదల చేసింది. వాటిలో ట్రంప్ ఫోటోతో పాటు ఆయన సంతకం బంగారు రంగులో కనిపిస్తుంది. మరో డిజైన్లో అమెరికా స్థాపకుల చిత్రాలు ఉన్నాయి. సాధారణంగా పాస్పోర్టులపై చారిత్రక సంఘటనలు లేదా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి ప్రదేశాల చిత్రాలు ఉంటాయి. కానీ ప్రస్తుత అధ్యక్షుడి ఫోటో పెట్టడం చాలా అరుదు. ఇదే సమయంలో ట్రంప్ సంతకంతో నాణేలు, కరెన్సీ నోట్లు కూడా తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!