
జనరల్

చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని లియుజౌలో సోమవారం తెల్లవారుజామున 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కారణంగా కనీసం 13 ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరొకరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ఘటన నేపథ్యంలో అధికారులు 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంప కేంద్రం సమీపంలో జాతీయ, ప్రాంతీయ అత్యవసర బృందాలు గాలింపు, సహాయక చర్యలను వేగవంతంగా కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వ్యక్తిని గుర్తించడానికి మరియు బాధితులకు సహాయం అందించడానికి చర్యలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!