
సినిమాలు

తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీదర్ మున్సిపల్ చెత్త వాహనాలను గత 15 రోజులుగా మల్గి గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. తమ గ్రామ శివారులో బీదర్ మున్సిపల్ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెత్త వాహనాలను అడ్డుకున్న వారిపై అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. అంతేకాకుండా మల్గి–బీదర్ రోడ్డుపై సుమారు 40 వాహనాల చెత్తను పారబోసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!