

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోంది. మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్లో విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ.5 లక్షలలోపు ఉండాలి. దరఖాస్తు సమయంలో వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. గ్రాడ్యుయేషన్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. జీఆర్ఈలో 260 లేదా జీమ్యాట్లో 500 స్కోర్ ఉండాలి. అలాగే టోఫెల్లో 60, ఐఈఎల్టీఎస్లో 6.0 లేదా పీటీఈలో 50 స్కోర్లలో ఏదో ఒకటి కలిగి ఉండాలి. అర్హులైన విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది. దరఖాస్తు ప్రక్రియ, ఇతర వివరాల కోసం తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్ను సందర్శించాలని తెలిపింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!