

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సీజన్లో రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా, అందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు ఇప్పటివరకు ₹8,749 కోట్ల కనీస మద్దతు ధర చెల్లింపులు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వలో ఉన్న 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ నెలాఖరులోపు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసే రైస్ మిల్లర్లు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!