
జనరల్

దేశ సరిహద్దుల భద్రత కోసం విశిష్ట సేవలు అందించిన కీర్తి చక్ర అవార్డు గ్రహీత మీనాక్షిసుందరం ను తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్విజయ్ ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఆయనకు ₹48 లక్షల చెక్కును అందజేసి సైనికుల త్యాగాలు, సేవలను గౌరవిస్తున్నామనే సందేశాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే సైనికుల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. లాన్స్ నాయక్ మీనాక్షి సుందరం చూపిన ధైర్యసాహసాలు దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఈ సత్కారం భారత సైనికుల పట్ల సమాజంలో ఉన్న గౌరవాన్ని మరింత ప్రతిబింబించే సందర్భంగా నిలిచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!