

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ఐఎండీ హెచ్చరికల ప్రకారం వచ్చే మూడు రోజుల్లో వడగాల్పుల ప్రభావం మరింత పెరగనుండటంతో జిల్లా కలెక్టర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. శనివారం సచివాలయంలో జరిగిన అత్యవసర సమీక్ష సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితులపై జిల్లా వారీ నివేదికలను పరిశీలించి ప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.
జిల్లా నివేదికల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కరు చొప్పున మొత్తం 16 మంది వడదెబ్బతో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలపై స్పందించిన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుకున్నాయని, ప్రజల ప్రాణాల రక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!