
జనరల్

కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ (వీటీయూ) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇంజినీరింగ్ ఆరవ సెమిస్టర్ పరీక్షలు ముగిసిన కేవలం ఐదు నిమిషాల్లోనే ఫలితాలను విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం 5.30కి పరీక్షలు ముగియగా, 5.35కే ఫలితాలు ప్రకటించడం విశేషంగా నిలిచింది. మొత్తం 60,856 మంది విద్యార్థులు బీఈ మరియు బీటెక్ ఆరవ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యారు. వీసీ ప్రొఫెసర్ ఎస్ విద్యాశంకర్ మరియు రిజిస్ట్రార్ (ఎవాల్యుయేషన్) ప్రొఫెసర్ యూజే ఉజ్వల్ సంయుక్తంగా ఫలితాలను విడుదల చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!