

నార్వేకు చెందిన జర్నలిస్ట్ హెల్లే లింగ్ తన సోషల్ మీడియా ఖాతాలు సస్పెండ్ అయ్యాయని వెల్లడించారు. నార్వేలో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన తర్వాత ఆన్లైన్లో తీవ్ర విమర్శలు ఎదురైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎక్స్లో ఆమె తెలిపిన వివరాల ప్రకారం, రోజంతా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాకు యాక్సెస్ లేకపోయి చివరకు అది సస్పెండ్ అయిందని చెప్పారు. “పత్రికా స్వేచ్ఛ కోసం ఇది చిన్న ధరే అయినా, ఇలాంటి అనుభవం నాకు ఇదే మొదటిసారి” అని ఆమె పేర్కొన్నారు.
తదుపరి పోస్టులో, తన ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ఖాతాలు రెండూ సస్పెండ్ అయ్యాయని ఆమె వెల్లడించారు. ఇవి మెటాకు చెందిన ప్లాట్ఫార్ములు కావడంతో, సమస్య పరిష్కారానికి మెటాను ట్యాగ్ చేస్తూ స్పందించారు. భారతీయ వినియోగదారుల నుంచి వచ్చిన సందేశాలకు వెంటనే స్పందించలేకపోతున్నానని, త్వరలోనే ఖాతాలు తిరిగి అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నానని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!