

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సుస్థిర మైనింగ్ రంగంలో మరో కీలక మైలురాయిని సాధించింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-2 ఓపెన్కాస్ట్ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసి, పర్యావరణ పరిరక్షణ, భూసంరక్షణ, గని పునరుద్ధరణ చర్యలను సమర్థవంతంగా అమలు చేసింది. ఈ నేపథ్యంలో గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన ఎస్క్రో నిధులను వడ్డీతో సహా తిరిగి చెల్లించేందుకు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపింది.
2013-14లో ప్రారంభమైన డోర్లీ-2 గని కోసం సింగరేణి సంస్థ రూ.26.79 కోట్ల ఎస్క్రో డిపాజిట్ చేసింది. గని మూసివేత అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIEST), శిబ్పూర్ నిర్వహించిన స్వతంత్ర ఆడిట్లో అన్ని నిబంధనలు సక్రమంగా అమలైనట్లు తేలింది. దీంతో వడ్డీతో కలిపి సుమారు రూ.40 కోట్లలో 90 శాతం అంటే రూ.36.63 కోట్లను విడుదల చేయనున్నట్లు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఇది సింగరేణి పర్యావరణ బాధ్యతకు మరో నిదర్శనంగా నిలిచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!