
సినిమాలు

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ సిక్కిం రాష్ట్రం తొలి పేపర్లెస్ న్యాయవ్యవస్థగా నిలిచింది. గ్యాంగ్టక్లో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్ ఈ ఘనతను అధికారికంగా ప్రకటించారు. కోర్టు వ్యవస్థలో పూర్తిగా డిజిటల్ విధానాలను అమలు చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకుంది.
ఈ కొత్త విధానంతో కేసుల విచారణ, డాక్యుమెంట్ల ప్రాసెసింగ్ వేగవంతం కానుంది. కాగితాల వినియోగం తగ్గడంతో పాటు కోర్టు వ్యవహారాల్లో పారదర్శకత, పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో న్యాయవ్యవస్థ మరింత సమర్థవంతంగా మారనుంది.
దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ సిక్కిం ముందంజ వేసింది. టెక్నాలజీ వినియోగాన్ని విస్తరించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని కోర్టులు కూడా పేపర్లెస్ విధానాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!