

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో నేటి నుంచి సెప్టెంబర్ 12 వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు. లోకకల్యాణార్థం శ్రావణ మాసం మొత్తం అఖండ శివనామ భజనలు కొనసాగనున్నాయి. మాసంలో మొత్తం 19 రోజుల పాటు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేయనున్నారు. అలాగే ఆగస్టు 18, సెప్టెంబర్ 1, 8 తేదీలైన మంగళవారాల్లో ఉదయం గర్భాలయ అభిషేకాలను కూడా నిలిపివేయనున్నట్లు దేవస్థానం తెలిపింది.
శ్రావణ శుక్ర, శని, ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజుల్లో రాత్రి 8:30 గంటలకు ఒక విడత స్పర్శ దర్శనాలకు 250 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. రద్దీ రోజులు మినహా మిగిలిన రోజుల్లో మూడు విడతలుగా స్పర్శ దర్శనాలు కొనసాగుతాయి. సామూహిక, గర్భాలయ అభిషేకాలు, కుంకుమార్చనలు యథావిధిగా నిర్వహించనున్నారు. శ్రావణ మాసంలోని 2, 3, 4వ శుక్రవారాల్లో ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!