
జనరల్

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. భానుడు తీవ్రంగా మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇతర ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా కొరట్పల్లిలో 45.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా సాత్నాలాలో 45.6 డిగ్రీలు నమోదు అయ్యాయి. కామారెడ్డి జిల్లా కొల్లూరులో 45.5 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అక్బర్పేట్-భూంపల్లిలో 45.2 డిగ్రీలు నమోదయ్యాయి.
అలాగే జగిత్యాల జిల్లా మల్లాపూర్, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్, నల్గొండ జిల్లా అడవి దేవులపల్లిలో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!