
జనరల్

తమిళనాడు మానవ వనరుల శాఖ మంత్రి డి. శరత్ కుమార్ డ్రగ్స్ వాడుతున్నారంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చిత్రీకరించిన ఆ వీడియోలో ఆయన మొబైల్ ఫోన్పై తెల్లని పదార్థాన్ని ఏటీఎం కార్డుతో పొడి చేస్తున్నట్లు కనిపించడంతో వివాదం చెలరేగింది.
ఈ ఆరోపణలపై మంత్రి శరత్ కుమార్ స్పందిస్తూ అది డ్రగ్స్ కాదని స్పష్టం చేశారు. దాదాపు రెండేళ్ల క్రితం స్టేడియంలో తన కుమార్తె అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు మందు ఇవ్వడానికి మాత్రను పొడి చేశానని తెలిపారు. వైరల్ అవుతున్న ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!