

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఇటీవల ‘ఒరెష్నిక్’ హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణితో పాటు వందలాది డ్రోన్లు, పలు క్షిపణులతో దాడులు చేసిన రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై మరిన్ని భారీ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అధ్యక్షుడు జెలెన్స్కీ విధాన నిర్ణయాలకు సంబంధించిన భవనాలు, రక్షణ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ తయారీ కేంద్రాలు లక్ష్యంగా మారవచ్చని పేర్కొంది. విదేశీ దౌత్యవేత్తలు, పౌరులు వెంటనే నగరాన్ని వీడాలని సూచించింది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని దాడుల ముప్పు ఉన్నందున కీవ్లోని అమెరికా దౌత్య సిబ్బందిని ఖాళీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బంది, విదేశీయులు వీలైనంత త్వరగా నగరాన్ని విడిచిపెట్టాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ తరహా హెచ్చరికలకు తాము భయపడబోమని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!