

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 7,437 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్కు సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పరీక్షలను భంగం కలిగించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర ప్రయోజన వర్గాలు ప్రయత్నిస్తున్నాయన్న నిఘా సమాచారంతో డీజీపీ సీవీ ఆనంద్ సహా ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా నుంచి పరీక్ష కేంద్రాల భద్రత వరకు ప్రతి దశలో కట్టుదిట్టమైన నిఘా ఉండాలని సీఎం సూచించారు. కోచింగ్ సెంటర్లు, నకిలీ వెబ్సైట్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసే దళారులు, సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్, ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని భద్రతా వ్యవస్థలు అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!