

అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయి ‘రూల్ ఆఫ్ ఫియర్’ నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అవినీతి, దుర్మార్గ పాలనను ప్రశ్నించకుండా ఉండేందుకు చట్టాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకున్నారని ఆరోపించారు.
వైఎస్ జగన్ ప్రధాన వ్యాఖ్యలు: “రెండేళ్ల క్రితం ఏపీ అంటే సంక్షేమం, అభివృద్ధికి మారుపేరు. కానీ నేడు రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, మోసాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది.”
విజయవాడలో సాయికృష్ణ కేసు, క్రాంతికుమార్ ఆత్మహత్య, కర్నూలులో దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్, తెనాలిలో తిరుపతమ్మ, శ్రీకాకుళంలో కళావతి ఘటనలు రాష్ట్రంలో చంద్రబాబు నడుపుతున్న ‘జంగిల్ రాజ్’కు అద్దం పడుతున్నాయి.
విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుని కొట్టి చంపి, కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వకుండా శవాన్ని మాయం చేయడం అత్యంత పాశవికమని ఆయన ఆరోపించారు. ఈ కేసులో కమిషనర్ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. కేవలం టాపిక్ను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు తన పార్ట్నర్తో కలిసి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో, కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపుల తట్టుకోలేక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు పేరపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఈరోజు సాయంత్రం విజయవాడలో పర్యటించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!