

క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో జరిగే మోసాల నుంచి ఖాతాదారులకు మరింత రక్షణ కల్పించేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం మోసంపై ఫిర్యాదు చేసిన ఐదు రోజుల్లోపు వివాదాస్పద మొత్తాన్ని షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ రూపంలో బ్యాంకులు ఖాతాదారుడి ఖాతాలో జమ చేయాలి. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకు నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే పూర్తి బాధ్యత బ్యాంకుదేనని ఆర్బీఐ స్పష్టం చేసింది.
థర్డ్ పార్టీ సైబర్ మోసాలను ఐదు రోజుల్లోపు నివేదిస్తే ఖాతాదారులపై ఎలాంటి ఆర్థిక బాధ్యత ఉండదని ఆర్బీఐ తెలిపింది. వివాదాస్పద మొత్తాన్ని అసలు లావాదేవీ తేదీ నుంచే తిరిగి జమ చేయాలని, దీంతో వడ్డీ భారం పడకుండా చూడాలని ఆదేశించింది. అలాగే రూ.500 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రతి ఎలక్ట్రానిక్ లావాదేవీకి బ్యాంకులు ఉచితంగా తక్షణ ఎస్ఎంఎస్ అలర్ట్లు పంపడం తప్పనిసరి చేసింది. డిజిటల్ మోసాల బాధితులకు పరిహారం చెల్లింపులపై కూడా కొత్త నిబంధనలను ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!