

పార్లమెంటుకు విద్యార్థులు చేపట్టిన ర్యాలీ సందర్భంగా పోలీసులు బలప్రయోగానికి దిగడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన. విద్యార్థులపై పెల్లెట్ గన్స్, ముళ్ల బాటన్స్, టియర్ గ్యాస్ ఉపయోగించారని ఆరోపించారు. శాంతియుతంగా ప్రశ్నలు అడిగిన విద్యార్థులపై దాడులు జరిగాయని, యువతులను కూడా పోలీసులు కొట్టారని, పలువురు గాయపడి ఎముకలు విరిగాయని పేర్కొన్నారు. ప్రశ్నలు అడిగిన యువతతో మోదీ ప్రభుత్వం అనాగరికంగా వ్యవహరించిందని విమర్శించారు.
పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నప్పటికీ హోం మంత్రి సభకు రాకపోవడాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. విద్యార్థులపై బలప్రయోగంపై చర్చించేందుకు ప్రతిపక్షం తీసుకొచ్చిన తీర్మానాలను తిరస్కరించారని ఆరోపించారు. ప్రభుత్వ మౌనం జరిగిన హింసకు ఆమోదం తెలిపినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ, అప్పటివరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!