
క్రీడలు

భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్థిక సంస్థల రుణ వసూళ్ల ఏజెంట్ల వేధింపులను అరికట్టేందుకు కొత్త మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది. కస్టమర్లతో అనుచిత ప్రవర్తన, బెదిరింపులు, రాత్రి వేళ ఫోన్ల వంటి చర్యలకు అడ్డుకట్ట వేయడమే ఈ నిబంధనల ప్రధాన లక్ష్యం.
కొత్త ముసాయిదా ప్రకారం రుణ వసూళ్ల ఏజెంట్లకు తప్పనిసరి అర్హతలు ఉండాలి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కాల్స్ చేయాలి. వసూళ్లకు ముందు కస్టమర్లకు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. ఏజెంట్ల వేధింపులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్ల సామాజిక మాధ్యమాల వివరాల లీక్పైనా నిషేధం విధించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!