
జనరల్

జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల విద్యార్థులకు భారత్తో పాటు జపాన్లోనూ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన తర్వాత కిటాక్యూషు నగరంతో కుదిరిన ఒప్పందం మేరకు టోక్యో కేంద్రంగా ఉన్న ఎల్ఎస్ పార్టనర్స్, కెరీర్ కన్సల్టెంట్ సంస్థలతో జేఎన్టీయూ ఒప్పందం చేసుకుంది. సెమీకండక్టర్లు, 3D డిజైన్, ఇంజినీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు.
జపాన్ ఉద్యోగాల కోసం విద్యార్థులను సిద్ధం చేయడానికి జేఎన్టీయూ క్యాంపస్లో జపనీస్ భాష శిక్షణ ప్రారంభించారు. నిపుణుల ద్వారా భాషతో పాటు వ్యక్తిత్వ వికాసం, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే క్యాంపస్లో ప్రత్యేక జపనీస్ భాష శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!