

లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించిన ఆరోపణలపై యూట్యూబర్ రమానందనపై ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. మండలంలోని పేరాయిపాలేనికి చెందిన యు.శ్రీనివాసరావు కోడలికి లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానని, ఇప్పటికే ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించానని రమానందన నమ్మబలికినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు రూ.10.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు తొలుత ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.1 లక్ష, అనంతరం రూ.9.50 లక్షలను నగదు రూపంలో చెల్లించారు.
అయితే ఎంతకాలమైనా ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు నగదును కూడా తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మోసపోయామని గుర్తించిన శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు జూలై 4న రమానందనపై మోసం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ అద్దంకి పోలీసులు శుక్రవారం నోటీసు జారీ చేశారు. ఈ నెల 17న అద్దంకి పోలీసుస్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!