

డీఎస్సీ నియామకాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఏడు దశల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దాంతో ఏం సాధించారని ప్రశ్నించారు. నిరుద్యోగుల భవిష్యత్తు ప్రభుత్వానికి ఆటగా మారిందా అని నిలదీశారు. ఈ సందర్భంగా మూడు కేసు అధ్యయనాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మొదటి కేసులో మెరిట్ జాబితాలో ఉన్న పేర్లను పరిశీలిస్తే అసలు పేర్లే కనిపించలేదని జగన్ పేర్కొన్నారు. రెండో కేసులో ఖోఖో అధికారులను సంప్రదించగా, సంబంధిత ధ్రువపత్రం నకిలీదని చెప్పినట్లు తెలిపారు. మూడో కేసులో నాగార్జున యూనివర్సిటీలో ఆరా తీయగా, ధ్రువపత్రంలో పేర్కొన్న క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలిందని ఆరోపించారు. ఏడు దశల్లో వెరిఫికేషన్ చేశామని చెబుతున్న ప్రభుత్వం అసలు ఎక్కడ, ఏం తనిఖీ చేసిందని జగన్ ప్రశ్నించారు. ఈ లోపాల వల్లే డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి నైతిక బాధ్యత వహిస్తారా లేదా అని ప్రశ్నించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!