

‘బేబీ’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో సంచలనం సృష్టించి, యూత్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’పై అంచనాలు ఉన్నాయి. ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్తో గుర్తింపు పొందిన ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 11న సినిమా థియేటర్లలోకి రానుంది. తాజాగా ఓ ఈవెంట్లో వైష్ణవి మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలో కొందరు తనను “నిన్ను ఎవరు గుర్తుపడతారు? గూగుల్లో నీ పేరు కొడితే ఏమైనా సమాచారం వస్తుందా?” అంటూ ప్రశ్నించేవారని గుర్తుచేసుకుంది.
ఆ మాటలు తనను తీవ్రంగా బాధించినప్పటికీ, ఆ అవమానాన్ని ఎలాగైనా విజయంగా మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు వైష్ణవి తెలిపింది. ఇప్పుడు గూగుల్లో తన పేరు టైప్ చేస్తే తన గురించి పూర్తి వివరాలు కనిపించడం తన జీవితంలో ఒక ఎపిక్ మూమెంట్ అని భావోద్వేగానికి గురైంది. అలాగే ఆనంద్ దేవరకొండ నుంచి తాను ఒక గొప్ప విషయాన్ని నేర్చుకున్నానని చెప్పింది. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎదుగుతున్నప్పుడు మనం కూడా మనస్ఫూర్తిగా సంతోషించాలని ఆనంద్ తన ప్రవర్తన ద్వారా చూపిస్తారని, ఆయన చాలా అరుదైన వ్యక్తి అని వైష్ణవి ప్రశంసించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!