

తమిళ సినీ ఇండస్ట్రీలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా సినిమాలు చేస్తూనే కంటెంట్ ఉన్న కథల్లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్పై భారీ బజ్ నెలకొంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా, తాజాగా మేకర్స్ విడుదల చేసిన మైండ్ బ్లోయింగ్ ప్రోమోతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
ఈ సినిమా టైటిల్ను ఈ నెల 7న అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రోమోలో కోల్కతా నగర వాతావరణాన్ని చూపించి, చివర్లో విజయ్ సేతుపతి, సాయి పల్లవి కళ్లతోనే అద్భుతమైన హావభావాలను పలికించడం ఆకట్టుకుంది. “వెలుతురు, నీడల మధ్య, జీవితం తన రంగులను కనుగొంటుంది” అనే క్యాప్షన్ కూడా సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!