

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’ పేరుతో ప్రతిరోజూ ఒక కేంద్ర మంత్రి ఓ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు, అభిప్రాయాలు, దేశానికి సంబంధించిన వివిధ అంశాలపై మంత్రులు వారితో చర్చించనున్నారు.
యువతతో ప్రభుత్వ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు యువత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి మంత్రులు వారికి వివరించనున్నారు. ఉన్నత విద్య, యువతకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్షంగా అభిప్రాయాలు సేకరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!