
సినిమాలు

రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా 2,344.12 ఎకరాల భూసమీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాడికొండ మండలం మోతడక గ్రామంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎర్రబాలెం–నంబూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం ఈ భూములను సమీకరించేందుకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మోతడకలో 689.861 ఎకరాల ప్రభుత్వ భూమి, 1,627.44 ఎకరాల పట్టా భూమి, 26.819 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం 7 ఎకరాలు, ఎర్రబాలెం–నంబూరు రైల్వే లైన్ కోసం 39.74 ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంతంలో రహదారులు, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ఈ భూసమీకరణ కీలకంగా మారనుంది. భూముల సమీకరణ ప్రక్రియ పూర్తయితే ఆయా ప్రాజెక్టుల నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!